AP: ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ కేవలం పదం కాదని, డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ ఉన్నన్ని రోజులు అభివృద్ధి కొనసాగుతుందన్నారు. 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులు అఖండ గోదావరికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2027 పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలున్నాయని పవన్ వివరించారు.