KMM: విద్యుత్ ప్రమాదాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏఈ శ్రీనివాస్ అన్నారు. గురువారం ముదిగొండ(మం) మేడేపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. రైతులు సొంతంగా విద్యుత్ తీగలను మరమ్మతులు చేయవద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే, స్థానిక జూనియర్ లైన్మెన్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.