BPT: బాపట్లలోని సూర్యలంక, ముత్తాయిపాలెం గ్రామాల్లో గురువారం మాదకద్రవ్య వ్యసనాలపై అవగాహన కల్పించారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాలయం, జిల్లా పరిషత్ పాఠశాలలో ర్యాలీలు నిర్వహించారు. Say No to Drugs నినాదాలతో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల భయానక ఫలితాలపై సీఐ, ఎస్సైలు పంచిన సందేశం యువతలో చైతన్యాన్ని నింపింది.