SKLM: పశుసంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టెక్కలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. కోటబొమ్మాళి(M)లో పశువుల సంరక్షణ కోసం ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలోని నేటి నుంచి జులై 10 వరకు అన్ని గ్రామాల్లో ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి నాలుగు విడతలుగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.