సీఎం సిద్ధ రామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కేసు CBIకి బదిలీ చేయాలన్న పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై లోకాయుక్త చేపట్టిన దర్యాప్తు పునఃపరిశీలన కోసం సీబీఐకి సూచించటానికి తమకు అర్హత లేదని తెలిపింది. కాగా.. సీఎం భార్య పార్వతికి అక్రమంగా ముడా 14 ఎకరాల స్థలం కేటాయించిందనే ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదైంది.