SKLM: రణస్థలం మండల పరిధిలోని పైడిభీమవరం సచివాలయాన్ని శుక్రవారం ఈవోపీఆర్డీ వి. ప్రకాష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు.