W.G: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ కోరారు. ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.