TG: బోరబండలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్షో నిర్వహిస్తామని జూబ్లీహిల్స్ BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చి వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. తమ ప్రజాదరణ చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడింది అని అన్నారు. ఉపఎన్నిక పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ రోడ్షోకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.