AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వల్లభనేని వంశీని కలవనున్నారు. విజయవాడ సబ్ జైలులో ములాఖత్ కానున్నారు. ఈ క్రమంలో అక్కడకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కారాగారం పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు.