AP: స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ‘ర్యాపిడో భాగస్వామ్యంతో 1000 మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది. ఈవీ వాహనాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ మహిళలకు ఊతమిస్తోంది. రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రయాణం కాదు.. ఇది అవకాశం, గౌరవం. ముమ్మాటికీ కూటమిది మంచి ప్రభుత్వమే’ అని అన్నారు.