ప్రకాశం: సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ కోరారు. సోమవారం కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని కేసులను పరిష్కరించుకోనే విధంగా పోలీస్లు కృషి చేయాలని తెలిపారు.