గుజరాత్ గవర్నర్గా పనిచేస్తున్న ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికైన తర్వాత గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ఆచార్యకు అదనపు బాధ్యతలు ఇస్తూ కేంద్రం ఉత్తర్వలు జారీ చేసింది. జూలై 22, 2019న గుజరాత్ గవర్నర్గా నియమితులైన ఆచార్య ఇప్పటికే తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.