SRPT: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు.