MDK: రాజపేట్ బ్రిడ్జ్ వద్ద గంగమ్మ వాగులో చిక్కుకున్న 10 మందిని ప్రాణాలకు తెగించి రక్షించిన యువకుడు దేవిసింగ్ను ఎస్పీ డీవీ శ్రీ నివాసరావు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ దేవిసింగ్ ధైర్యసాహసాన్ని కొనియాడుతూ, ఆయన పేరును జాతీయ స్థాయి ధైర్యసాహస పురస్కారాలకు నామినేట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.