భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి (Uma Bharti) సొంత పార్టీపై ఫైర్ అయ్యారు.ఆ రాష్ట్రంలో ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్ర(Jana Aashirwad Yatra)కు తనను పిలువకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ యాత్రలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు జన ఆశీర్వాద్ యాత్రను బీజేపీ (BJP) చేపట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలకుగాను 24 సీట్లు బీజేపీ గెలిచింది.
వింధ్యా ప్రాంతం మీదుగా ఈ యాత్ర సాగనున్నది.కాగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన ఉమాభారతిని జన ఆశీర్వాద్ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి పిలువలేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ బీజేపీపై ఆమె మండిపడ్డారు. తాను యాత్రలో ఉంటే ప్రజలందరి దృష్టి తనపైనే ఉంటుందని, అందుకే బీజేపీ నేతలంతా భయపడి ఉంటారని ఎద్దేవా చేశారు. అలాగే సోషల్ మీడియా (Social media) ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘జన ఆశీర్వాద యాత్రకు నాకు ఆహ్వానం అందలేదన్నది నిజమే. అయితే, నాకు ఆహ్వానం అందినా, అందకపోయినా నేను తక్కువ కాదు. ఇప్పుడు ఆహ్వానించినా వెళ్లబోను. సెప్టెంబరు 25న జరిగే యాత్ర ముగింపు వేడుకకు కూడా నేను హాజరుకాను’ అని ఎక్స్లో హిందీలో ట్వీట్ చేశారు.
బీజేపీ మెగా యాత్రకు తనను ఆహ్వానించకపోవడం పట్ల సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి (Uma Bharti) అసంతృప్తి వ్యక్తం చేశారు.తాను పోస్టర్ గర్ల్లా ఉండదలుచుకోలేదని స్పష్టం చేశారు. తానిప్పటికీ ప్రధాని మోదీ (PMMODI) కంటే వయసులో చిన్న అని చెబుతూ తాను మరో 15, 20 ఏండ్లు పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు. పార్టీ యాత్రకు తనను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తాను యాత్రకు హాజరైతే ప్రజల దృష్టి అంతా తనమీదే ఉంటుందని వారు (బీజేపీ నేతలు) భయపడి ఉంటారని ఉమా భారతి తెలిపారు.ప్రభుత్వ ఏర్పాటులో (2020లో) వారికి జ్యోతిరాదిత్య సింధియా (Scindia) సాయం చేసిఉండవచ్చని, అయితే తాను 2023లో పార్టీకి భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు తాను సహకరిస్తానని ఫైర్బ్రాండ్ నేత స్పష్టం చేశారు