ఇండియన్ సినిమాలో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది మోడర్న డైరెక్టర్లలో ఒక్క ఆర్జీవి మాత్రమే. కానీ ఆయన గత దశాబ్దంలో తీసిన సినిమాలు అన్నీ ఆయన పేరుప్రతిష్టలను కించపరిచేవిధంగానే ఉన్నాయి తప్పితే ఆయన ఫేంకి ఏమాత్రం కల్సిరాలేదు. దీనికి తోడు ఆయన విచ్చలవిడి నైజం, సోషల్ మీడియాలలో ఆయన విశృంఖలమైన వ్యవహారశైలి, ఆయన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే తిక్కమాటలు వెరసి ఆయన స్థాయిని పూర్తిగా అంటే పూర్తిగా దిగజార్చేశాయి.
ఇండియన్ ఫిల్మ్ ఢైరెక్టర్స్ లో మన ఆర్జీవికున్నంత పాప్యులారిటీ, ఫేం, క్రేజ్ మరో డైరెక్టర్కి లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి రోజుల్లో ఆయన చవకబారు సినిమాలు తనని తానే తగ్గించుకున్నారు తప్పితే ఆయన్నెవరూ ఎప్పుడూ ఎక్కడా వేలిత్తి చూపించిందే లేదు. ఇండియన్ సినిమాలో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది మోడర్న డైరెక్టర్లలో ఒక్క ఆర్జీవి మాత్రమే. కానీ ఆయన గత దశాబ్దంలో తీసిన సినిమాలు అన్నీ ఆయన పేరుప్రతిష్టలను కించపరిచేవిధంగానే ఉన్నాయి తప్పితే ఆయన ఫేంకి ఏమాత్రం కల్సిరాలేదు. దీనికి తోడు ఆయన విచ్చలవిడి నైజం, సోషల్ మీడియాలలో ఆయన విశృంఖలమైన వ్యవహారశైలి, ఆయన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే తిక్కమాటలు వెరసి ఆయన స్థాయిని పూర్తిగా అంటే పూర్తిగా దిగజార్చేశాయి.
అయితే మొన్నీమధ్య ఆయన జెడి చక్రవర్తి హీరోగా డైరెక్ట్ చేసిన సత్య రీరిలీజ్ మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయనని ప్రస్తుతిస్తూ ఫోస్ట్ లతో సోషల్ మీడియా చాలా సందడి చేసింది. నిజమే. సత్య చిత్రం ఇండియన్ సినిమాలో ఓ సంచలనం. జెడికి ఓ గొప్ప మలుపు. జెడి అంతకు ముందు అలాటి సినిమా చేయలేదు. తర్వాత కూడా చేయలేదు. సత్య 1998లో వచ్చింది. తర్వాత ఆర్జీవి సర్కార్, కంపెనీ, భూత్ లాంటి సినిమాలు చేసి తన రికార్డును బ్రహ్మాండంగా నిలబెట్టుకున్నారు. కానీ, ఇటీవలి రోజుల్లో అటువంటి సినిమాలు తనే తీసాడన్న విషయాన్ని కూడా తానే మరచిపోయి, పిచ్చిపిచ్చి సినిమాలు తీసి అక్కర్లేనంత అప్రతిష్టని మూటగట్టుకున్నారు. విమర్శకులకు కావాల్సినంత ఫుడ్ అందించారు.
మళ్ళీ ఇక్కడే మరో మలుపు. ఎప్పుడైతే సత్య రిలీజై రీరిలీజ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిందో, రామ్ గోపాల్ వర్మలో అనూహ్యమైన మార్పు వచ్చింది. తనకి సత్య చూసి ఏడుపొచ్చిందని, తాను గమ్యం లేని నడక నడిచానని, సక్సెస్ మత్తు తలకెక్కి, కళ్ళు నెత్తికెక్కాయని తానే స్వచ్ఛందంగా ఒప్పుకుని తన ప్రపంచవ్యాప్త అభిమానులకు క్షమాణలు చెప్పుకునే రేంజ్లో ట్వీట్ చేశాడు. ఇక మీదట మునపటిలా అద్భుతమైన చిత్రాలనే చేస్తానని కూడా ఆయన వాగ్దానం చేశారు.
దాని ఫలితమే సిండికేట్. ఈ చిత్రంలో భారతదేశంలో టాపెస్ట్ యాక్టర్స్ గా పేరు మోసిన వారెందరో ఉన్నారు. అమితాబ్ దగ్గర్నుంచీ అందరూ ఉన్నారు సిండికేట్లో. ఈ న్యూస్ రాగానే ఆయన అభిమానులు మళ్ళీ అభినందనలతో సోషల్ మీడియాలో శివతాండవం చేసేశారు. అందులో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా కూడా ఉండడం విశేషం. చిన్నాపెద్దా అన లేకుండా ఇండియాలో ఉన్న డైరెక్టర్లందరూ రెచ్చిపోయారు. నిజంగానే రామ్ గోపాల్ వర్మలాంటి గొప్ప డైరెక్టర్ నుంచి మరో మహాచిత్రరాజం వస్తుందంటే ఇండియన్ సినిమాకే ఓ పెద్ద కుదుపు.
అయితే ఇందులో లీడ్ క్యారెక్టర్ అమీర్ ఖాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాని సుప్రసిద్ధ నిర్మాత, వాణిజ్యవేత్త, పొట్లూరి వరప్రసాద్ నిర్మించబోతున్నారని తెలిసింది. ఇంకా అమీర్ ఖాన్ వార్త అధికారికంగా వెలువడలేదు. అమీర్ ఖాన్ గనక సిండికేట్లో చేస్తే ఇది మరో సంచలనమే. ఎందుకంటే గతంలో 1995లో వీళ్ళ కాంబినేషన్లో రంగీలా వచ్చింది. దేశేంలో ఉన్న అన్ని రికార్డులనీ రంగీలా బ్రేక్ చేసిందప్పుడు. ప్రతీ అవార్డు రంగీలానే వరించింది.
ఇప్పుడా కాంబినేషన్ రిపీట్ అయితే గ్యారెంటీగా ఇండియాలో అది అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివలే.