భారతీయుడు-2 చిత్రీకరణ కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లాకు వచ్చాడు. చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు కడపలో ఉండనున్నాడు. అయితే షూటింగ్ కోసం వచ్చిన కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు భారీగా తరలిరావడంతో కమల్ హాసన్ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ నమస్కారం అంటూ చేతులు ఊపారు. దీనివలన షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడింది. అయినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్...
పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే తన సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం సందర్భంగా భావోద్వేగానికి లోనైంది. అతడు పెళ్లి చేసుకోవడంపై చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. గతంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. చిన్న పిల్లలా నవ్వేశా.. ఆనందంతో ఏడ్చేశానని అభిమానులతో పంచుకుంది. పూజా సోదరుడు రిషబ్ హెగ్డే, శివానీ శెట్టి ప్రేమ వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ప...
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడాడు. తారకరత్నను చూశానని.. కోలుకుంటున్నాడని తెలిపారు. తారక్ ఫైటర్ అని.. చాలా యాక్టివ్ గల వ్యక్తి అని త్వరలో క్షేమంగా బయటకు వస్తాడని తెలిపాడు. ‘తారకరత్నను చూశా. కోలుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి...
మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు సోదరిమణులు ఒక్క చోటకు చేరారు. వారితో పాటు వారి పిల్లలు, కోడళ్లు, మనుమలు, మనువరాళ్లతో చిరంజీవి నివాసం సందడిగా మారింది. జనవరి 29 చిరంజీవి తల్లి జన్మదినం. ప్రతి యేటా ఆమె పుట్టిన రోజును కుటుంబసభ్యులు అందరి కలిసి ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా చిరంజీవి దూరంగా ఉన్నారు. తాజాగా ఆదివ...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి అభిమానులకు తెలిపారు. ఇవాళ ఉదయమే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 వ తారీఖున మా కుటుంబంలో దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చాలా దురదృష్టకర...
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే తారక్ మాత్రం తన 30వ సినిమా గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. [&...
హీరో రాజశేఖర్ కూతురు శివాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రాజశేఖర్, జీవిత కూతురిగా ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్ తో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’. ఈ సినిమా విషయానికొస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కగా మొదటి సినిమాతోనే మంచి నటిగా ...
బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కా...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో గేట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అభిమానులంతా ముందుకు తోసుక...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. నందమూరి కుటుంబసభ్యులంతా తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కుటుంబసభ్యులే కాకుండా నందమూరి అభిమానులు కోరుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తన సోదరుడు ఆరోగ్యం బాగా లేక...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హీరోలు సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు ఆయన తన గాత్రాన్ని అ...
ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర ...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ […]
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ కు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తన ఫ్యాన్స్ కు షారుఖ్ అద్బుతమైన సినిమా అందించారని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదిన విడు...