తమిళ స్టార్ హీరో కార్తీ ‘వా వాథియార్’ సినిమాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.21 కోట్ల బకాయిల వివాదంలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా బకాయిలు చెల్లించేందుకు.. సినిమా హక్కులను బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఫైనాన్షియర్కు పూర్తి బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదల చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.