హీరోలు పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ ఫొటోలు, వీడియోలు వాణిజ్య అవసరాలకు వాడుకోవడం.. తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని పిటిషన్ వేశారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, X, గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2026 మే 12వ తేదీకి వాయిదా వేసింది.