రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీకి షాక్ తగిలింది. ఈ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని సింగిల్ బెంచ్ వద్ద మెన్షన్ చేస్తూ లాయర్ శ్రీనివాస్.. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ జరగనుంది.