ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్గా మారిపోయారు ఇద్దరు. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇచ్చిన లీకేజీ మాత్రం అదిరిపోయేలా ఉంది.
అసలు రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో.. ఒకసారి లైగర్ ప్రమోషన్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ తెలుగులో మాత్రమే ఫాలోయింగ్ ఉన్న విజయ్.. లైగర్ రిలీజ్కు ముందే పాన్ ఇండియా లెవల్లో ఇండియాను షేక్ చేశాడు. కానీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే.. రౌడీ ఇప్పుడు వంద కోట్ల హీరో. కానీ ఇప్పుడు విజయ్ రెమ్యూనరేషన్ ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తోంది.
హీరోయిన్ అవికా గోర్ నటించిన '1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమాతో అవికా బాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(punch prasad) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తోటి నటుడు ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ఇన్ స్టా (instagram) వేదికగా వెల్లడించారు. ప్రసాద్ అన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అన్నకి సీరియస్ గా ఉందని…ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అన్నారని పేర్కొన్నాడు. అందుకోసం చాలా ఖర్చు అవుతుందని..తాము ట్రై చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు సాయం చేయాలని ...
ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రేజ్ కూడా అలాగే ఉంది. ఏకంగా చరణ్, ప్రభాస్నే పక్కకు పెట్టేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది.
ఒక కొత్త ఇంటర్వ్యూలో అదా శర్మ(Adah Sharma) తన పరిశ్రమలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఓ సినిమా చేసిన తర్వాత తన ముక్కు గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. అయితే గతంలో పలువురు అదాశర్మ ముక్కు బాలేదని కామెంట్లు చేశారని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియోకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆయన కారణంగా ఇప్పుడు ఓ యువతి ఫేమస్ అయ్యింది. ఆయన నీలమ్ గిల్(Neelam Gill) అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నారట. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. దాదాపు 30ఏళ్ల వయసు గ్యాప్ ఉన్న హీరోతో ఈ మోడల్ డేటింగ్ చేస్తుండటంతో..అందరూ ఈమె అసలు ఎవరు అని తెలుకునే పనిలో పడ్డారు.
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasarao) పలుమార్లు సినీ నిర్మాతలు, స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కాగా తాజాగా ఆయన మరోసారి రెమ్యూనరేషన్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల గురించి స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. తాజగా బికినీలో మెరిసింది. అసలే సమ్మర్ వేడి అంటే, ఇలా రకుల్ బికినీలో కనిపించి మరింత చెమటలు పట్టేలా చేయడం విశేషం.
అక్కినేని అఖిల్ ఎన్నో భారీ ఆశలు పెట్టుకొని నటించిన సినిమా ఏజెంట్. స్టైలిష్ మేకర్గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి(Surender Reddy) డైరెక్టర్ అవడంతో.. అఖిల్కు భారీ మాసివ్ హిట్ పడుతుందని అనుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు సూరి. దీంతో ఈయనకు ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఆయన చేసిన పాత బాకీ వల్లే.. ఇప్పుడో బంపర్ ఆఫర్ అందుకున్నాడు.
అప్పుడప్పుడు బాక్సాఫీస్ దగ్గర అన్నదమ్ముల వార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాజాగా దగ్గుబాటి హీరోలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. హీరోలుగా కాకపోయినా.. రానా, అభిరాం(rana and abhiram) బాక్సాఫీస్ బరిలో ఉండడంతో.. ఎవరిది పై చేయి అనే టాక్ నడుస్తోంది.
RRR, బాహుబలి సినిమాలను కొట్టే ప్రాజెక్ట్ ఏది అంటే.. ప్రాజెక్ట్ కె(Project K movie) అంటున్నాడు రానా(Rana Daggubati). ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ని మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని.. సాలిడ్ స్టేట్మెంట...
ఒకప్పుడు ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ని చూస్తే భయపడిపోతుంది బాలీవుడ్. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్కు వెళ్లిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా హిందీ జనం మన సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో ఓ రెండు ప్రాజెక్ట్స్ మాత్రం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెమటలు పట్టిస్తున్నాయి.