AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి ATGH వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,037 మంది భక్తులు దర్శించుకోగా.. 30,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.