NRPT: నారాయణపేట మండలం బొమ్మను పాడు గ్రామంలో గురువారం గొల్ల పెంటప్ప అనే వ్యక్తి వరి గడ్డివాము ట్రాక్టర్లో వేసుకొని వెళ్తున్న క్రమంలో పైన వున్న విద్యుత్ తీగలు తగిలి గడ్డి వాముకు నిప్పు అంటుకుంది. గమనించిన రైతు ట్రాక్టర్ ఇంజన్ను వేరు చేశాడు. అనంతరం ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డి మొత్తం కాలి బూడిద అయింది.
ఆఫ్ఘనిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాజ్నీ ప్రావిన్స్లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 52 మంది మృతి చెందగా.. మరో 65 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలోని జాతీయ రహదారి వద్ద గురువారం అప్పుల బాధ తాళలేక గురువారం మోహన్ బాబు(23) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజోలి మండలం నరసనూరు గ్రామానికి చెందినవాడు కాగా.. మండల కేంద్రమైన అయిజలో రెడీమేడ్ షాపును నిర్వహిస్తున్నాడు. దీనిపై మానవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడారం సమీపంలో గురువారం ఉదయం బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చంద్రపూర్ నుంచి పాల్వంచకు వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
KMM: మణుగూరు సింగరేణి ఏరియా ఓసీ-2లో గురువారం ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. డంపర్ బోల్తా పడటంతో మూన్ చందా అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు డంపర్ ఆపరేటర్గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని సింగరేణి అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వియత్నాం రాజధాని హనోయిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బార్లో గొడవపడ్డాడు. అనంతరం బటెక్తో పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. పక్కనే బైక్లు, ఇతర వాహనాలు నిలిపి ఉంచడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసే ప్రయత్నాలను చేస్తున్నారు.
KNL: అస్పరి (మ) జోహారాపురంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడినట్లు ట్రైని DSP ఉషశ్రీ తెలిపారు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా, ముత్తుకూరులోని తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KMR: ఎల్లారెడ్డి మండలం రేపల్లేవాడి గ్రామానికి చెందిన పిట్ల స్వప్న (25) బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మెదక్ జిల్లాకు కోచ్చారం నుంచి ద్విచక్ర వాహనంపై తన మరిది శ్రీనివాస్తో స్వప్న వస్తుండగా బైక్ డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు.
MDK: జనవరి నెలలో గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్లో మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ గజ్వేల్ న్యాయమూర్తి ప్రియాంక తీర్పును వెలువరించినట్లు గజ్వేల్ సీఐ సైదా తెలిపారు. జగిత్యాల పట్టణం జాంబాగ్కు చెందిన మహమ్మద్ అక్తర్(44) ఈ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించారు.
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: మహిళా మృతికి కారణమైన నిందితుడికి మిర్యాలగూడ ఐదో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మిర్యాలగూడ మండలం జైత్ర తండాకు చెందిన సైదులు లక్ష్మమ్మను ట్రాక్టర్తో బుద్ధి చంపేశాడు. అప్పటి మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేయాగా.. సీఐ రమేష్ బాబు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.
ATP: యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో క్రిష్టిపాడుకు చెందిన శివకేశవ అనే కార్మికుడు మృతి చెందగా.. షణ్ముఖ రెడ్డి, దీపక్ సింగ్, ధన్వార్ సింగ్, కంబగిరి స్వామికి త్రీవ గాయాలయ్యాయి. వీరు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సత్యసాయి: గోరంట్ల మండల గుంతపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పుట్టపర్తి మండలం పెడబల్లి తండాకు చెందిన మహేశ్ నాయక్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి అదే తండాకు చెందిన రాజేశ్ నాయక్ అని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.