విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. ఉదయ్ ను పులివెందుల నుంచి కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారణ.
ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.
బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.
చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.
రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.
పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.
హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు.
ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.