Naveen Kumar: బిజినెస్‌మెన్ నవీన్ కుమార్‌పై బాంబ్ ఎటాక్

తమిళనాడులో బాంబు ఘటన తీవ్ర కలకలం రేపింది. వ్యాపారవేత్త నవీన్ కుమార్‌ కారుపై మదురైలో కొందరు గుర్తు తెలియని దుండగులు బాంబ్ ఎటాక్ చేశారు.

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 10:36 AM IST

Naveen Kumar: తమిళనాడులో బాంబు ఘటన తీవ్ర కలకలం రేపింది. వ్యాపారవేత్త నవీన్ కుమార్‌ కారుపై మదురైలో కొందరు గుర్తు తెలియని దుండగులు బాంబ్ ఎటాక్ చేశారు. టిఫిన్ బాక్స్ బాంబులతో దాడి చేయడంతో నవీన్‌ కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ బాంబు తీవ్రతకు నవీన్ కుమార్ కారుతో పాటు చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు బాంబు ఎటాక్ చేశారు? ఆర్థిక లావాదేవీల కారణంగా చేశారా? లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: CJI Chandrachud: దేశం కోసం ఓటేయడం మరిచిపోవద్దు