PDPL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2025- 26 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని అక్షిత ప్రతిభ చాటింది. బాక్సింగ్ అండర్-60 వెయిట్ కేటగిరీలో పోటీపడి రజత పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓదెల ఎంఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.
NGKL: పుట్టగానే కులోన్మాదానికి బలైతానని పాపం ఆ బిడ్డకు ఏం తెలుసు?, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ నేడు కానరాని లోకాలకు వెళ్లింది. 9 నెలలు మోసిన ఆ తల్లి కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో. ఫులే, అంబేడ్కర్ లాంటి మహనీయులు ఎంత మంది పోరాడినా ఇప్పటికీ కుల వివక్ష ప్రాణాలు తీస్తోందన్న దానికి కుమ్మెర ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
MLG: కన్నాయిగూడెంలో దేవాదుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాల వివాదానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని తెలిపారు.
JN: చిల్పూర్ మండలంలోని లూనావత్ తండాకు చెందిన గుగులోతు సురేష్ (24) కొబ్బరి చెట్టు నుంచి కింద పడి మృతిచెందాడు. కొబ్బరిచెట్టు ఎక్కి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.
KMM: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దరఖాస్తులు కోరారు. గత ఐదేళ్లలో 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, అందులో 50% మంది మొదటి శ్రేణిలో నిలిచిన రాష్ట్ర/కేంద్ర గుర్తింపు పొందిన పాఠశాలలు దీనికి అర్హులన్నారు.
SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని కోళ్ల షెడ్లలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్లు చనిపోతున్నాయని అనుమానిస్తున్న యజమాని, జెసిబితో గుంతలు తీసి వాటిని పాతిపెట్టారు. అయితే, వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PDPL : గోదావరిఖని బెడెన్ పావెల్ పార్కులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు, బెడెన్ పావెల్ 169వ జన్మదినం, ‘వరల్డ్ థింకింగ్ డే’ ఆదివారంఘనంగా నిర్వహించారు. RG-1 SO to GM చంద్రశేఖర్ పావెల్ విగ్రహానికి నివాళులర్పించి, స్కౌట్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 200 మంది విద్యార్థులతో ‘శాంతి ప్రగతి యాత్ర’ చేపట్టారు. స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.
NZB: రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో పూల్ విన్నర్గా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ల్లో నిజామాబాద్ క్రీడాకారిణులు వరుస విజయాలు సాధించారు. హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జట్లను మట్టికరిపించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
HNK: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల పాలిట వరంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. 45వ డివిజన్ పరిధి లోని కడిపికొండకు చెందిన దామెరుప్పుల సురేష్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2,50,000/-చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
KMR: కామారెడ్డి జిల్లా ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కళాశాల ఆస్తుల విషయంలో నేరుగా కలెక్టర్ వద్దనే కూర్చుందామని, నేడు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ చేశారు. దాంతో కళాశాల ఆస్తుల అన్యాక్రాంతం అంశం ఇప్పుడు కలెక్టర్ వద్దకు చేరింది. సోమవారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ పాలకవర్గం ఏర్పాటైనా, తగిన సౌకర్యాలు ఇంకా కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం పాత కౌన్సిల్ హాల్లోనే నిర్వహించగా, భవిష్యత్ సమావేశాల నిర్వహణపై కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనం, ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది.
JN: చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ గుట్టలో 9 రోజుల బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూలైన్, వసతి, అన్నప్రసాద వితరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈనెల 28న బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. దేవస్థానం ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తెలిపారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను పారిశుధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. గత కౌన్సిల్ గడువు ముగిసిపోవడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నూతనంగా కార్పొరేటర్ ఫలితాలు వెలవడి, డివిజన్ నుంచి గెలిచిన గుండా సంతోష్ పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్య క్రమం నేటి నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతులను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
WGL: జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖిలా WGLకు చెందిన కోల వెంకటేష్ (38) ద్విచక్ర వాహనంపై వరంగల్ మున్సిపాలిటీ వైపు వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.