సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద నిర్మిస్తున ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.
NRML: జిల్లాలో బాల్యవివాహాలు,మాదక ద్రవ్యాల వినియోగం,రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సంవత్సరం 45, ఈ ఏడాది 2 బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
MHBD: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమ్మయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి చేరుకున్న సందర్భంగా వారిని ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
WNP: తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్ మరి ఆదేశాలు మేరకు జిల్లా నుంచి 10 మంది బాలురు,10 మంది బాలికలు 4వ తరగతి ప్రవేశానికి వనపర్తి జిల్లాలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు యువజన అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్సైట్లో http:/tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MDK: నిజాంపేట మండలంలో 120 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గుర్తించినట్లు లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. నార్లాపూర్లో నారాయణ, లక్ష్మి రైతుల భూముల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టారు. ఆయిల్ ఫామ్ తోటల ప్లాంటేషన్ చేసిన రైతులు సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.
NGKL: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్లో రాస్తామన్నారు. అత్యుత్సాహం చూపిన ఏ పోలీసు అధికారిని వదిపెట్టామని హెచ్చరించారు.
MNCL: పదవ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని పీఎంశ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం భీమారంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో, పరీక్ష రోజు ఎలా చదవాలో జ్ఞాపకశక్తి పెంచుకునే పద్ధతులను నేర్పించారు.
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ADB: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘లెర్న్ స్మార్ట్ విత్ AI’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఈ శిక్షణను చేపట్టాయి. కృత్రిమ మేధతో విద్యాబోధన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.
ASF:ఆ సిఫాబాద్ పట్టణంలో ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన రద్దీ ప్రాంతంలో చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
SRPT: యజమాని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వల్లభాపురం శివారులోని ఇటుక బట్టీలో మట్టి తొక్కుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ పల్లపు రాజు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కండిషన్ లేని వాహనాన్ని నడపాలని యజమాని చల్లా నాగరాజు ఒత్తిడి చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈరోజు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
KNR: పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార అహంకారంతో మావోయిస్టులను అంతం చేస్తామని హెచ్చరికలు చేయడం సరికాదని CPI సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయడం సాధ్యం కాదని ఆకలి, అణిచివేత ఉన్నంత వరకు విప్లవం ఉంటుందని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్ఛార్జ్గా పని చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మీ తెలిపారు.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు.అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే రైతుబంధు విడుదల చేయాలన్నారు
NLG: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాలలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో… మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై బృందం అధ్యయనం చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తుందని తెలిపారు.