ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం స్థానికులతో కలిసి పూజ చేశారు. కల్వర్టు నిర్మాణంతో వ్యవసాయ పొలాలకు వెళ్ళటానికి రైతులకు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
NLG: శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ‘ఓం నమశ్శివాయ’ నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండాలలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
HYD: మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్కు కేంద్ర బడ్జెట్లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది.
KNR: మొక్కజొన్న చేనును పాడు చేస్తున్న కోతులను తరమడానికి చింపాంజీ మాస్క్ ఉపయోగించి ఊరట పొందాడు ఓ రైతు. శంకరపట్నం మండలం కరీంపేటకి చెందిన చింతిరెడ్డి మల్లారెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. కోతుల నుంచి పంటను రక్షించుకోవడానికి ఆన్లైన్లో చింపాంజీ మాస్క్ కొనుగోలు చేసి, దానిని ఓ వ్యక్తికి ధరింపజేసి కోతులను తరుముతున్నట్లు తెలిపాడు.
SRD: కార్మికులు కర్షకుల సమస్యలపై పోరాటాలు చేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం రేతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.
WNP: కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో లబ్ధిదారులు రాధ, మణెమ్మల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.
HYD: గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 4 కేజీల ఎండు గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
BDK: బూర్గంపాడు మోరంపల్లిబంజర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం గ్రామంలో పట్టపగలే బహిరంగంగా జరుగుతున్న ఇసుక లోడింగ్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.
HNK: వేలేరు మండలం పరిధిలోని ఎర్రబెల్లిలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ధరావత్ రాజ్ కుమార్ (30) అనే యువకుడు తన పిన్నిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చి ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగ్రహించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.
VKB: పెద్దేముల్ మండల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శంకర్ను వికారాబాద్కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన ప్రశాంత్ వర్ధన్ను తిరిగి నియమించారు. ఎస్సై శంకర్ తన మూడు నెలల కాలంలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసి ప్రజల మన్ననలు పొందారు. కాగా, కొత్తగా నియామకమైన ఎస్సై ఈరోజే బాధ్యతలు స్వీకరించనున్నారు.
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన మూతి నాగరాజు రమణి దంపతుల కుమారులు మను శ్రీ విష్ణు వర్ధన్ దొర, రిత్విక్ శ్రీ వర్ధన్ దొరల పంచకట్టు వేడుక గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పంచకట్టు వేడుక అని అన్నారు.
NZB: రాబోయే వేసవిలో మండలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఇసుక సరఫరా జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాల్లో ముందున్న ఎస్ఆర్ ఫౌండేషన్ సేవలను కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్లో ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజేతలైన బీబీపేట్ మండల విద్యార్థులను ఆయన అభినందించారు. కాగా, డాకూరి రోహిత్, చిట్టబోయిన వంశీ రాష్ట్రస్థాయిలో మెరిసి పతకాలు సాధించారు.
WGL: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన పోలీస్ జాగిలాలను CP పరిశీలించారు. ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని CP అన్నారు. అదనపు డిసిపిలు శ్రీనివాస్, రవి, తదితరులు ఉన్నారు.