JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కోరారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా ‘ఏఎన్సీ డే’ క్లినిక్ నిర్వహించి, వారికి రక్త పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
MLG: జిల్లా కేంద్రంలోని పోట్లపూర్ గ్రామంలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోత్ రవి చందర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
GDWL: గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన రంగస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అయిజలోని బ్యాంకులో ఆయన చేయించుకున్న PMSBY బీమా పథకం ద్వారా రూ.2 లక్షల మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ రుద్ర గౌడ్ సోమవారం మృతుడి భార్య మాధవికి అందజేశారు. ఈ నగదును పిల్లల భవిష్యత్తుకు వాడాలని సూచించారు.
KMM: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సోమవారం సీపీఎస్ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కూసుమంచి మండలం, జీళ్ళ చెరువు కాంప్లెక్స్ మీటింగ్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లెకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మెన్ పడిగెల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలం లింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళ సంఘ భవనం (వీవో) భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్, వార్డు సభ్యులు రాజు, ఏఎంసీ డైరెక్టర్ నారాయణ ఉన్నారు.
NRPT: నాగర్ కర్నూల్లో చిన్నారి మృతి ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, మున్సిపాలిటీ పాత బస్టాండ్ చౌరస్తాలో సీపీఐ మండల నాయకులు, రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ చేసి ధర్నా చేశారు. సీపీఐ నాయకుడు హనుమంతు సమగ్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
NLG: కుల దురహంకారం తో పసి కందును కాలుతో తొక్కి ప్రాణాలు తీసిన కుమ్మెర ఘటన దోషులను శిక్షించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రారపు పెద్దులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపి కుల దురహంకారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
KMR: కామారెడ్డి పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MBNR: స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల్ శ్రీనివాస్ సాగర్ అన్నారు. సోమవారం సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాబా తన పాటలతో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు.
MDK: ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నిజాంపేటలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజలదూర భారాన్ని, ప్రయాణ బత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఏర్పాటు చేశామన్నారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. మున్సిపాలిటీ అభిరుద్దికి సహకారం అందచేస్తామని అన్నారు.
KNR: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. గన్నేరువరంలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
MNCL: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిణామాలపై కాంగ్రెస్పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మాజీ అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్ సోమవారం మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన కూడా ఉందని గుర్తు చేశారు.
PDPL: సుల్తానాబాద్ మండలంలో 2వ బ్యాచ్గా 13 గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు కనుకుల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీ దివ్య దర్శనరావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పాలనలో సభ్యుల పాత్ర కీలకమని, గ్రామసభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా అవినీతి లేకుండా పనిచేయాలని అన్నారు.
SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇంకా పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పరిహారం చెల్లించాల్సి ఉందని నాయకులు కదిరే రాజ్ కుమార్ పాల్గొన్నారు.