KNR: బొమ్మకల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన నిందితులపై ఇన్స్పెక్టర్ వరుణ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేశారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
VKB: దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ పటిష్ఠతకు పని చేయాలని సూచించారు.
HYD: సైబర్ నేరాలపై పోరాటంలో HYD సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో కలిసి షార్ట్ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. లాటరీ, డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ 1930 హెల్ప్ లైన్ను ఫిర్యాదు చేయాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.
NRPT: మక్తల్ టౌన్ నుంచి అనుగొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో నిండిన రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని అంటున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా స్పందన లేదని మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వనపర్తి: సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని కుల సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ప్రతి సంఘం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్ద ముందడుగు మండలంలోని చిన్న మందడి గ్రామంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి సంఘం ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు.
KMR: డోంగ్లీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం ఫ్రూట్స్ డే నిర్వహించారు. విద్యార్థులు 102 రకాల పండ్లను ప్రదర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్, వైస్ ఛైర్మన్ సోమ రజిని రాజశేఖర్ మాట్లాడారు. పకృతి మనకు ప్రసాదించిన అపురూప వరం పండ్లు అని, నిత్యం పండ్లు తీసుకోవడం వలన జబ్బులు దారి చేరవని అన్నారు.
NZB: రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరానికి రూ.15 వేల చొప్పున వెంటనే జమ చేయాలని కోరారు.
నల్గొండ: సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదరాబాదు రోడ్డులో పిస్తా హౌస్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
JN: చిల్పూరు మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలో అంతర్జాతీయ ‘రెడ్ బుక్’ డే సందర్భంగా CPM నేతలు “కమ్యూనిస్టు ప్రణాళిక” అనే పుస్తకాలను చదివారు. ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు ప్రణాళిక అనే పుస్తకాన్ని చదవాలని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిత్యం కృషి చేస్తారని మండల కార్యదర్శి సాదం రమేష్ అన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.
MLG: మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలు మరువలేని సీతక్క అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
WGL: సంగెం మండలం కొత్తగూడెంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.
RR: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువును సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. MLA వీర్లపల్లి శంకర్కు రైతులు చెరువుసమస్యలను విన్నవించడంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. MLA ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖఅధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన నివేదికలు సేకరించారు.