పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ను పంచుకున్నాయి. కాగా, రేపు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచకప్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా అదిరిపోయే ఆరంభాలతో జట్టును ఆదుకున్న అభిషేక్, ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి ఫామ్ లేమి జట్టు బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు సౌతాఫ్రికాతో జరగే సూపర్-8 పోరులోనైనా అభిషేక్ జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కాగా, T20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్తో సఫారీలు 7 సార్లు తలపడగా.. 5 సార్లు టీమిండియానే విజయం సాధించింది.
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా, వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, రెండు జట్లు చెరో పాయింట్ను పంచుకుంటాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్తో ఇవాళ ఏడడుగులు వేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సహచర క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ధావన్కు తన మొదటి భార్యతో ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది.
టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ రేసులో తొలి అడుగు వేయాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆసీస్ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో హర్మన్ప్రీత్ సేన కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ 176 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో తన ఫామ్పై వస్తున్న విమర్శలకు అభిషేక్ స్పందించాడు. తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని అతను స్పష్టం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా తాను ఇదే దూకుడుతో ఆడుతున్నానని, భవిష్యత్తులో కూడా అదే ఆటతీరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా గేమ్స్లో క్రికెట్ కూడా ఉండటంతో, అక్కడ IND-PAK పోరు జరిగే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ ఫామ్పై కెప్టెన్ సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నిజానికి మీరు అతని గురించి కాదు, రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందాలి’ అని సూర్య తెలిపాడు. గతేడాది అభిషేక్ జట్టు కోసం చాలా చేశాడని, ఇప్పుడు అతనికి అండగా నిలివాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా 176/6 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.
సూపర్-8లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ‘ఆక్యూవెదర్’ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఈరోజు రాత్రి 80 నుండి 100 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లు చెరో పాయింట్ను పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండు జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.
అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉండటంతో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే, ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ను ఆడించే వీలుంది.
T20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం ఆన్లైన్ స్ట్రీమింగ్లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా అత్యధికం. దీంతో ఈ మ్యాచ్ బ్రాడ్కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.