బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 175 దుకాణాలు ఉన్న భవన సముదాయంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. నగరంలోని చిక్కపేట పరిధిలోని కుంబారపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JN: నర్మెట్ట మండలం హనుమంతపురం వద్ద బొమ్మకూరు ఎడమ ప్రధాన కాలువ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువలో ఉన్న పూడిక, చెట్ల తొలగింపు పనులను వారం రోజులలో పూర్తి చేసి మంగలి బండ తండా వరకు సాగు నీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే కడియం ఆదేశించారు.
AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆనం రామనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లలో ప్రజలపైనే కాదు ఆలయాలపైనా దాడులు జరిగాయి. రామతీర్థం మొదలు దుర్గమ్మ ఆలయం వరకు.. అన్ని ఆలయాల్లో ఎన్నో అపచారాలు చేశారు. మేం వచ్చాక ఆలయాల్లో రాజకీయ ప్రమేయం తగ్గించాం. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేయిస్తున్నాం. దేవాదాయశాఖలో ఇచ్చిన 98 శాతం హామీలు అమలు చేశాం’ అని పేర్కొన్నారు.
CTR: పలమనేరు ఎస్సై స్వర్ణ తేజ ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “ధైర్య స్పర్శ”, మహిళలపై నేరాలు, మహిళా భద్రతా చర్యలు, డయల్ 112 అత్యవసర సేవల వినియోగం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేగొండ మండలం మహిళా విభాగం అధ్యక్షురాలుగా సాదు అనితను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని నూతన అధ్యక్షురాలికి జిల్లా అధ్యక్షులు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల నేతలు పాల్గొన్నారు.
KNR: జిల్లాలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది ఉన్నారు. NTPC డా.మంజుల,నిఖిల్, ప్రదీప్, వినయ్, అనుష, స్వాతి, సాయికిరణ్, స్ఫూర్తిరావు, KNR డా. సింధు, హిమజ, SRCL డా.పర్వీన్ ఫాతిమా, రవికుమార్లు ఏడాదికి పైగా విధులకు రానందుకు తొలగించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా బుధవారం బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు
BPT: వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు ఆర్థిక సాయం అందించారు. ఆసుపత్రి వైద్యురాలు స్వాతికిరణం విజ్ఞప్తి మేరకు, రోగుల కోసం కుర్చీలు (బల్లలు), మందుల బీరువా కొనుగోలు నిమిత్తం రూ. 23,100 చెక్కును బుధవారం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాత సేవలను వైద్య సిబ్బంది అభినందించారు.
NTR: విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన “బీచ్ శాండ్ మినరల్స్ టు టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పై జరిగిన వర్క్షాప్లో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని బీచ్ సాండ్ ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకమని తెలిపారు.
MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మురళినాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు.
కృష్ణా: దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం కూటమి నాయకులు నివాళులు అర్పించారు.
SRCL: ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు.
HNK: పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDOగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈవో పదోన్నతి పొందారు. ఈ మేరకు నేడు ఆయనను కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ ఉన్నారు.
BDK: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
TG: నాగర్కర్నూల్లో మాజీమంత్రి KTR పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇది మాటలకందని మహా విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదని.. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.