• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ@225

HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 23, 2026 / 08:09 AM IST

నాణ్యమైన మొక్కలు సకాలంలో సిద్ధం చేయాలని

KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.

February 23, 2026 / 08:08 AM IST

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో భారీ దొంగతనం

BDK: సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నందనవనం కాలనీలో భారీ దొంగతనం నిన్న జరిగింది. ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ రఘునాథ్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 5.9 తులాల బంగారం, 40.8 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్ళినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.

February 23, 2026 / 08:06 AM IST

ట్రైన్‌లో బంగారం ఉన్న బ్యాగ్ చోరీ

VSP: విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్‌లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేశారు. సీపీ RPF పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్‌లో వెళ్లిపోయినట్టు గమనించిన RPF పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీన పరుచుకున్నారు .

February 23, 2026 / 08:05 AM IST

నేటి నుంచి శనగ కొనుగోలు

KRNL: రైతుకు గిట్టుబాటు ధర కల్పించే చర్యల్లో భాగంగా నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవి, మార్క్ ఫెడ్ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. క్వింటాలు రూ. 5,875కు కొంటామని చెప్పారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

February 23, 2026 / 08:05 AM IST

వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఆదివారం నక్కలగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సౌజన్యంతో మహా అన్నదానం, రథోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:05 AM IST

మండలిలో 7 బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్

AP: అసెంబ్లీ ఆమోందించిన 7 బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక శాఖకు సంబంధించి 2 చట్టసవరణ బిల్లులు, దేవదాయ శాఖకు సంబంధించి 2, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల చట్టసవరణ బిల్లులు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన బిల్లులను మండలి ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మండలిలో లఘు చర్చ జరగనుంది.

February 23, 2026 / 08:04 AM IST

‘అమలాపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ’

కోనసీమ: APSSDC ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DSDO హరి శేషు సోమవారం తెలిపారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:04 AM IST

బుచ్చిరెడ్డపాలెంలో భక్తురాలి వద్ద నుంచి నగదు చోరీ

NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన ఆవరణలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తురాలు వద్ద మద్యం సేవించిన వ్యక్తి రూ. 5000 అపహరించారు. దీనిని పసిగట్టిన మహిళ అక్కడే ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో అతడిని సిబ్బంది పట్టుకుని అతని వద్ద ఉన్న రూ. 2,000లను తిరిగి ఇప్పించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:03 AM IST

బషీరాబాద్‌లో సూచిక బోర్డులు లేక ప్రయాణికుల తికమక

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూలమలుపు నుంచి జీవంగి, ఇందర్చేడు, నవాంగి గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉండటంతో కొత్త వాహనదారులు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

కుమ్మెర ఘటనపై కేశంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ

RR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసి పసికందును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేటలో BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేసి మర్డర్ కేసు నమోదు చేయాలని నాయకులు కోరారు. మహిపాల్ మహారాజ్, రాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

ఉచిత శిక్షణకు .. నేడే లాస్ట్

MBNR: జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో DDU -GKY& స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

February 23, 2026 / 08:02 AM IST

గ్రామ పాలనపై ‘సర్పంచ్’లకు స్పెషల్ క్లాస్..

MNCL: గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా జన్నారం మండల సర్పంచులు సిద్ధమయ్యారు. మంచిర్యాల ఇంజనీరింగ్ కళాశాల వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ‘సర్పంచుల శిక్షణ తరగతుల’ను సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని జన్నారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుదిరే వెంకన్న కోరారు.

February 23, 2026 / 08:02 AM IST

ఇంటర్ విద్యార్థులకు ALL THE BEST

AP: ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ పరీక్షలు ఒక మైలురాయి. ఈ పరీక్షలు భవిష్యత్ విద్యా, వృత్తి అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. కాబట్టి విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావాలని కోరుకుంటూ.. హిట్ టీవీ తరఫున ALL THE BEST

February 23, 2026 / 08:02 AM IST

మహిళా సంఘ భవనాలలో మరుగుదొడ్లు నిర్మిస్తాం: DRDO

ASF:మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమేనని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారావు ప్రకటనలో తెలిపారు.కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 08:01 AM IST