• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.

February 22, 2026 / 07:51 AM IST

104 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 07:50 AM IST

గల్ఫ్ కార్మికులకు ఆసరా.. హెల్ప్ లైన్ నంబర్ విడుదల..!

NRML: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 93984 21883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

February 22, 2026 / 07:49 AM IST

నర్సీపట్నంలో ఘనంగా కాళికామాత పండుగ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం ఘనంగా శ్రీ కాళికామాత పండుగను నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పండుగలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. కాళికామాతను డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని గుడివరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 07:48 AM IST

ఆ ప్రమాదం జరిగి నేటికి ఏడాది..!

NLG: జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు పనులు అవాంతరాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి నేటికీ ఏడాది అయ్యింది. ఈ ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇంకా 9 కి.మీ పనులు జరగాల్సి ఉంది.

February 22, 2026 / 07:47 AM IST

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ

AP: రాష్ట్ర ప్రభుత్వం, భారత్ నెట్ మధ్య ఇవాళ ఎంవోయూ కుదరనుంది. సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ అందించడం, డిజిటల్ సేవలను విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నారు.

February 22, 2026 / 07:47 AM IST

మాతృభాషపై అభిమానం చాటుకున్న విద్యార్థులు

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అ’ ఆకారంలో కూర్చొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకోవాలని, మాతృభాష అమ్మ లాంటిదని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:46 AM IST

ఎచ్చెర్ల ఎంపీపీగా విజయ్ కుమార్‌కి బాధ్యతలు

SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి కొన్ని రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో మండల పరిషత్తు కార్యక లాపాలు సజావుగా నిర్వహించేందుకు ఉప ఎంపీపీ-2 జరుగుళ్ల విజయ కుమారికి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ను విజయవంతం చేయండి’

NLR: ప్రతి కుటుంబ సమగ్ర వివరాలను సేకరించడమే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ముఖ్య ఉద్దేశమని ఎంపీడీవో రంతులయ్య తెలిపారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ ఫ్యామిలీ ఐడిని కేటాయించనున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ సర్వేలో ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.

February 22, 2026 / 07:45 AM IST

నకిలీ పురుగు మందు.. రూ.8 లక్షల స్టాక్ సీజ్..!

SRPT: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో భారీగా నకిలీ పురుగుమందు విక్రయం బట్టబయలైంది. ప్రముఖ కంపెనీ ‘Bayer Nativo’ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపులు, గౌడౌన్‌లపై శనివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. రూ.3 లక్షల విలువైన నకిలీ ప్యాకెట్లు, పౌడర్‌తో పాటు రూ.8 లక్షల విలువైన పెస్టిసైడ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

గెలిస్తే రూ. 35 వేల బహుమతి

KDP: VN పల్లె(M) తలపనూరు గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 26న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి శనివారం తెలిపారు. బహుమతులు వరుసగా రూ. 35వేలు, రూ. 30వేలు, రూ. 25 వేలు,రూ. 20 వేలు, రూ.15వేలు ఇలా 12 బహుమతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటలకే ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.

February 22, 2026 / 07:44 AM IST

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికను కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి మునగాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

February 22, 2026 / 07:43 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భింద్ జిల్లాలోని హైవేపై ఓ వ్యాన్‌ను వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 22, 2026 / 07:42 AM IST