NLG: మిర్యాలగూడ మండలం ఆలగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన RSN రైస్ మిల్ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారంగా ఉన్న మన ప్రాంతంలో రైస్ మిల్లుల స్థాపన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మిల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
KDP: పెండ్లిమర్రి సమీపంలోని భైరవగుట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కడప వైపు నుంచి వేంపల్లి వైపు వెళ్తున్న మూడు స్కూటర్లను ప్రమాదవశాత్తు వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: కోటవురట్ల మండలం పాములవాక పశువైద్యశాలకు వచ్చిన పశువుల దాణా లారీని వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. లారీలో పశువుల దాణా బస్తాలను అర్హులైన YCP సానుభూతిపరులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామానికి రెండు పశువుల దాణా లారీలు రాగా వాటిని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టీడీపీ వారికి పంపిణీ చేశారని ఆరోపించారు.
ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామం సమీపంలో చుట్టూ అందమైన కొండల మధ్యలో గుట్టపై వెలసిన పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఈ ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. కాగా, నేడు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు.
KRNL: చిప్పగిరిలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలూరు MLA విరుపాక్షి రూ. 50,000 విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువులని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ADB: గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలని అభివృద్ధి సాధించాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
AP: అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బంది అవుతోందనే ఉద్దేశంతో R-5 జోన్ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ జోన్లోని 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించనున్నారు. గతప్రభుత్వం అక్కడ వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. అయితే, అక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.
ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మంచిర్యాల ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శృతి గోలిస్ బర్త్ రూట్ ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, హౌస్ కీపింగ్, ఫార్మసిస్ట్, సిస్టం ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.
KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.