సత్యసాయి: రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి DSP శివన్నారాయణ స్వామి ఆదివారం వివరాలు వెల్లడించారు. నిందితుడు బాధితుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేయడమే కాకుండా, కత్తితో బెదిరించి అదనంగా నగదు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. తనిఖీల్లో భాగంగా నిందితుడి నుంచి ఫార్చునర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
E.G: ప్రజలు కోరుకున్న మంచి పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు తన అనుచరులు సుమారు 100 మందితో కలసి ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.
VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బసవరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బసవేశ్వరుడు చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.
SRD: అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆదివారం ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
SKLM: బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 కార్యక్రమం గాయత్రీ కాలేజ్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు.
WG: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్ లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకుని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకునే ముందే రెడీ చేసుకోవాలని సూచించారు.
NDL: మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న 55 గదుల వసతి సముదాయానికి ఎన్ఆర్ఐ దాత సరోజినీ వడ్లమూడి రూ.1.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. మొదటి అంతస్తు నిర్మాణానికి ముందుగా రూ.65 లక్షల చెక్కును ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. తన తల్లిదండ్రులు వీరమాచినేని వీర రాఘవయ్య, నాగభూషణమ్మ జ్ఞాపకార్థంగా ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.
AKP: జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారించాలన్నారు.
KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
అన్నమయ్య: రామాపురం సుద్దమల్ల గ్రామంలోని ఓబుల్ రెడ్డిగారిపల్లె దిగువ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న శ్రీరామాలయ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఓ ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ.. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
CTR: బైరెడ్డిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎన్. అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం రూ.112.50 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తగా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.
MBNR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ ఎపిసోడ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, యువత ప్రేరణ, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
KRNL: మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆదివారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయులు టీడీపీ యువనేత రాకేష్ రెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి, సురేష్ నాయుడు, మల్లికార్జున, వెంకటేష్ ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు.
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో ఆదివారం YCP ఆధ్వర్యంలో ‘జనం మాట-జగనన్న బాట’ డిజిటల్ రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారి జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి మద్దతుగా తీర్మానం చేశారు.