RR: రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సమీపంలో దారుణ హత్య వెలుగుచూసింది. టోలి చౌకికి చెందిన అమీర్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
SRCL: కెనాల్ నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరుతూ రైతులు రోడ్డపై నిరసన చేపట్టారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ సమీపంలో ఎల్ఎమ్ 6కెనాల్ నిర్మాణం చేపట్టాలంటూ రైతులు చేపట్టిన నిరసనదీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పాటు వంటావార్పు చేపట్టారు.
VKB: పరిగికు చెందిన ఫిట్నెస్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సాయి రామ్ (U45), ఆకాశ్ (U59), రజిత తమ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. కోచ్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. భవిష్యత్లో మరిన్ని పోటీల్లో రాణించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి MLA KVR సవాల్ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు వెళ్దామని, తాను తప్పు చేసినట్లు రుజువైతే షబ్బీర్ అలీ కాళ్లు మొక్కి, శాశ్వతంగా రాజకీయం సన్యాసం తీసుకుంటానని అన్నారు. తాను మాట మీద ఉంటానని తెలిపారు. కాంగ్రెసోళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆట మొదలు పెట్టారని, రేపటి నుంచి అసలు ఆట తాను చూపిస్తానని హెచ్చరించారు.
VZM: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో బాగంగా మూగజీవులకు దాహార్తి తీర్చేందుకు నీళ్ల కుండీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల్లో శనివారం నీళ్ల కుండీలను స్థానిక ఉపాధి హామీ పనుల కార్యక్రమ అధికారి జనార్ధనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవికాలంలో పశువులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
VSP: ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఆదివారం విశాఖలో సాగర సంగ్రామ దీక్ష నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఎస్.టీ.యూ నాయకుడు భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్ రాయవరం ఎంఈఓ కార్యాలయం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.
JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన దావు హార్తిక్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో 12 ఏళ్ల బాలుర కాటాస్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాడు.
MDK: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వార్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్కు సంబంధించి నేతలకు, కార్యకర్తలకు తగు సూచనలను చేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నర్సాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, శ్రీకాంత్ నిరంజన్ దాస్ను సన్మానించారు.
TG: సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువు ఈ నెలాఖరు వరకు పెంచారు. ఈనెల 20తో ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి సీసీఐ సీఎండీతో మాట్లాడారు. ఎంపీ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన అధికారులు కొనుగోళ్లను మరో ఏడు రోజులు పొడిగించనున్నట్లు ప్రకటించారు.
KKD: సామర్లకోట భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలు నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో పెద్దాపురం భార్గవ్ ఆసుపత్రి వైద్యులచే అన్ని వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలిపారు. ఈ సేవలను సద్విని యోగం చేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు.
NLG: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని పద్మ తెలిపారు. ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్-డిగ్రీ వారు అర్హులని వెల్లడించారు.
కోనసీమ: ఇవాళ సెలవు దినమైనప్పటికీ, అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఎపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్. రాజేశ్వరి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ (ATP) కేంద్రాలు కూడా తెరిచి ఉంటాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
AP: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇవాళ ‘ఆర్గానిక్ రైతోత్సవం’ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా నిర్వహించనున్నారు. ఆర్గానిక్ ఆహార ప్రాముఖ్యతపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. పలువురు అధికారులు, రైతులు ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు.
కోనసీమ: తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమందేపల్లిలోని జామియా మజీద్లో ఆదివారం నాలుగవ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మజీద్కు చేరుకున్న ముస్లింలు వజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవిత్ర ఖురాన్ పారాయణం, నమాజ్ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్యతను చాటారు.