MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
VSP: చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాల వల్ల పనులు నిలిచిపోగా, తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అడ్డంకులు తొలగడంతో త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. పాదచారుల చిరకాల స్వప్నమైన ఈ ఫుట్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.
BHNG: వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలో బాల్య ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆటో ఆగి ఒక్క సారిగా రివర్స్ చెయ్యడంతో వెనుక నుండి కార్ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు, కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
NLR: విజయవాడలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ మేధావుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, ముస్లిం మత పెద్దలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి పవిత్ర గ్రంథమైన ఖురాన్ను, రంజాన్ తోఫాను అందజేశారు.
GNTR: వైసీపీ ఎస్టీ సెల్ (మైదానప్రాంత) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండా సురేంద్ర నియమితులయ్యారు. గతంలో ట్రైకార్ ఛైర్మన్గా పనిచేసిన ఆయన మైదానప్రాంత గిరిజనుల సమస్యలపై చురుకుగా స్పందించారు. గిరిజనులకు పార్టీకి మధ్య వారధిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు మండలం బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా ఈ నెల 23న అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హనుమంతు శుక్రవారం తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన కాడెద్దులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 20 వేలు, తృతీయ బహుమతిగా రూ. 15 వేలు, నాల్గవ బహుమతిగా రూ. 10 వేలు, ఐదవ బహుమతిగా 5 వేలు అందజేస్తామన్నారు.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: సెమీస్లో భారత్ బౌలింగ్ ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు 118 పరుగులకే పరిమితమైంది. యువ భారత్ తరఫున కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీ ఫైనల్ చేరేందుకు టీమిండియా విజయ లక్ష్యం 126 రన్స్.
TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
NLG: మునుగోడు మండలం పలివెలలో చింతకాయలు తెంచుతున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మాద నరేందర్, వల్లెపు సాయిల నుంచి బంగారు గొలుసు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రవిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.
KNR: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో ఉచితంగా చేయించుకోవచ్చని వెల్లడించారు.
VZM: బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతునట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది.
W.G: ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలవనరుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘లైడార్’ విమానం ద్వారా ఆకాశంలో సర్వే పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 20న నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, గణపవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పరిసరాల్లో, 21న పేరుపాలెం, మొగల్తూరు, భీమవరం, వీరవాసరం, ఉంగుటూరు, భీమడోలు ప్రాంతాల్లో విమానం ద్వారా సర్వే జరగుతుంది.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.