• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

“మన్ కీ బాత్” 131వ కార్యక్రమాన్ని వీక్షించిన..BJP నేతలు

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన “మన్ కీ బాత్” 131వ కార్యక్రమాన్ని BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు, BJP నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. BJP ప్రభుత్వంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 01:10 PM IST

డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి

E.G: పెరవలి మండలం కాకరపర్రు గ్రామం నందు శ్రీ ఆదివారం జరిగిన గంటాలమ్మ దేవి అమ్మవారి వాయ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు మంత్రి సూచించారు.

February 22, 2026 / 01:10 PM IST

జిల్లా టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన

బాపట్ల: జిల్లాలో నూతన టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం లాంఛనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు కూడా ఈ భూమిపూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

February 22, 2026 / 01:10 PM IST

శ్రీవారికి వైసీపీ ఎమ్మెల్సీల అపచారం: ఎమ్మెల్యే

సత్యసాయి: వైసీపీ నేతలకు హిందూ మతంపై నమ్మకం లేదని, వారిది కపట ప్రేమ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎం.ఎస్.రాజు విమర్శించారు. శాసనమండలిలో చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని అపచారం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో లడ్డూ కల్తీ, తలనీలాల అక్రమాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఎమ్మెల్యే ఆరోపించారు.

February 22, 2026 / 01:09 PM IST

దిబ్బనకల్‌లో రూ.15 లక్షలతో తాగునీటి సంపు ప్రారంభం

KRNL: దిబ్బనకల్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి సంపును సర్పంచ్ పెద్దలక్ష్మి, టిడిపి నాయకులు లక్ష్మన్న ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సహకారం గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మద్దతుతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

February 22, 2026 / 01:08 PM IST

నిజాంసాగర్ ప్రాజెక్టు.. 1500 క్యూసెక్కుల నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా ఆదివారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.903 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.

February 22, 2026 / 01:08 PM IST

కేయూలో శతావధానం ప్రారంభం..

HNK: కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాలులో శతావధానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ… శతావధానం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కేయూకు ప్రత్యేక చరిత్ర ఉందని, కేయూ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 22, 2026 / 01:07 PM IST

NCPవి రాజకీయ ఆరోపణలే: పల్లా శ్రీనివాసరావు

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై NCPవి రాజకీయ ఆరోపణలేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ‘అజిత్ పవార్ దుర్ఘటన బాధలో అలా మాట్లాడి ఉండొచ్చు. రామ్మోహన్ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది. ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే వ్యక్తి చంద్రబాబు. బాక్సైట్ అంశంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

February 22, 2026 / 01:06 PM IST

మూసీ బాధితులకు సబితా ఇంద్రారెడ్డి భరోసా

TG: గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం అవసరమే లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒక్క ఇళ్లును కూడా టచ్ చేయకుండా రేవంత్ అరాచకాన్ని తాము అడ్డుకుంటామని చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:06 PM IST

‘దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

WGL: భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహిస్తున్న “మన్ కీ బాత్” 131వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు 28వ డివిజన్ 105 బూత్‌లో కార్యకర్తలతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వీక్షించారు. రవికుమార్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, బీజేపీకి ప్రజలు అండగా నిలవాలన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

గోకారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NGKL: చారకొండ మండలం గోకారం పంచాయతీ ఏడవ వార్డులో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ పర్శరాములు ఆదివారం ప్రారంభించారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చెన్న కేశవులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

నగర వాసుల ఫిర్యాదుతో ఆగిన పైప్ లైన్ పనులు

KDP: ప్రొద్దుటూరు సమీపంలోని అమృత నగర్ ప్రభుత్వ కాలనీలో పేదల నివాసాల నుంచి అనధికార ప్రైవేట్ వెంచర్ సిరిపురి కాలనీకి తాగునీటి పైప్ లైన్ నిర్మిస్తున్న పనులను పంచాయతీ తీర్మాణం మేరకే చేపట్టినట్లు సర్పంచ్ శివచంద్రారెడ్డి తెలిపారు. అయితే, అమృతనగర్ వాసుల ఫిర్యాదు మేరకు పైప్ లైన్ పనులను నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వెల్లడించారు.

February 22, 2026 / 01:05 PM IST

శ్రీనివాస్‌కు 100 మంది శ్రీనివాసుల సత్కారం

KNR: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున 100 మంది శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శ్రీనివాసుల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలలో 30వేల మంది శ్రీనివాసులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

February 22, 2026 / 01:05 PM IST

ఘనంగా రాజగోపాలరావు వర్ధంతి వేడుకలు

SKLM: శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలింగుల సంక్షేమానికి రాజగోపాలరావు చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ సంతోష్ తెలిపారు.

February 22, 2026 / 01:04 PM IST

నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏప్రిల్ నెలలో మరల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 01:04 PM IST