BDK: మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామం సమీప గోదావరి నది నుంచి నిత్యం అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం మీదగానే ట్రాక్టర్లు అదుపు లేకుండా విపరీత వేగంతో సంచరిస్తుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయని నేడు స్థానికులు చెబుతున్నారు.
SRD: హత్నూర మండలంలోని నాగులదేవుపల్లిలో గురువారం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ చాముండి శిరీష, సంఘం అధ్యక్షురాలు బాయికాడి లావణ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భ్రమరాంబ, ఉప సర్పంచ్ మాణిక్యం, వార్డు సభ్యులు అరుణ, గణేశ్, మీనా, మాజీ సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి ఈ భవనం దోహదపడుతుందని తెలిపారు.
అఫ్గన్ కోచ్గా జొనాథన్ ట్రాట్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు ప్లేయర్లు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు. జద్రాన్ తన POTM అవార్డును ట్రాట్కు అంకితం చేశాడు. ట్రాట్ నాలుగేళ్లుగా అఫ్గన్ను వెంటుండి నడిపారని, తొలి రోజు నుంచే తమను తీర్చిదిద్దారని నబీ ట్వీట్ చేశాడు. ట్రాట్ కోచింగ్లో అద్భుతంగా గడిపామని, ఆయన వెళ్లిపోవడం కష్టంగా ఉందని రషీద్ పేర్కొన్నాడు.
MDK: కౌడిపల్లి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మిర్జాపూర్ కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రి పనితీరుపై ఆరా తీశారు. వైద్య సేవలు, నిర్వహణ పట్ల సూపరింటెండెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్లను అభినందించారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
NGKL: నాగర్ కర్నూల్ పేరు వెనుక చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్ కర్నూల్గా రూపాంతరం చెందింది. నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.
SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
PLD: సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొన్న యాజమాన్యాలు, ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ నేడు అటు పొలం లేక, ఇటు పరిశ్రమలు రాక రైతులు కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: చిట్యాల నుంచి ఉరుమడ్ల, నేరడ దారుల్లో, పెద్దకాపర్తి లోకి వెళ్లే దారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు మొండెం వరకు నరికివేశారు. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇలా నిర్దాక్షిణ్యంగా రంపంతో కోయడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
TG: హైదరాబాద్లో భారీ ఆన్లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వేల్పుల భీమయ్య అనే ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్, కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, విజయరాణి తిరుపతి, మున్సిపల్ అధికారులు సాయికుంటలోని నివాసానికి వెళ్లి భీమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ RRO కాలనీలో ఎల్లమ్మ, పొచ్చమ్మ గుడుల్లో అర్థరాత్రి దొంగతనం జరిగింది తాళాలు పగులగొట్టి 2 హుండీలు, బంగారు నగలు, వెండి కిరీటాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఇద్దరు అనుమానితులు రికార్డు అయినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.10 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, చేవెళ్ల మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,550 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18వేలు, టమాటా మిర్చి రూ. 37వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
CTR: విజయపురం మండలంలో గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో మహర్దశ కలిగింది. విజయపురం మండలంలో ముత్యాలరెడ్డి కండ్రిగ, మంగళం మీదుగా విజయపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని పట్ల మండల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.