• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తలుపులలో ‘చెత్త నుంచి సంపద’ సేకరణకు స్వచ్ఛ రథం

సత్యసాయి: తలుపుల మండల పరిషత్ కార్యాలయం వేదికగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో భాగంగా ‘చెత్త నుంచి సంపద’ సృష్టించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్లోని వ్యర్థాలను అందజేస్తే, ప్రతిగా ఉపయోగపడే వస్తువులను స్వచ్ఛ రథం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ వినూత్న సేవల పట్ల పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 02:20 PM IST

ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం: ఎమ్మెల్యే

ATP: అనంతపురం ఓల్డ్ టౌన్‌లో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే అందజేయాలని కోరారు.

February 21, 2026 / 02:20 PM IST

ప్రత్యక పూజలు చేసిన జంగా

BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

February 21, 2026 / 02:20 PM IST

నకిరేకల్‌లో అగ్ని ప్రమాదం

నల్గొండ: నకిరేకల్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ షాప్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. భారీ మంటలు వ్యాపించడంతో స్థానికులు, దుకాణ యజమానులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 02:18 PM IST

నల్లచెరువు ఘటనపై కమిషనర్ సీరియస్

GNTR: నల్లచెరువులో బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై శనివారం కమిషనర్ మయూర్ అశోక్ స్పందించారు. ఈ నెలలోనే ఏబీసీ (ABC) సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చి కుక్కల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యానిమల్ బోర్డ్ అనుమతులు వచ్చినందున డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.

February 21, 2026 / 02:18 PM IST

టీమిండియాపైనే ఒత్తిడి: సౌతాఫ్రికా కోచ్

సూపర్‌-8 పోరులో రేపు భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒత్తిడితోనే భారత్ ఓడిపోయే అవకాశం ఉందన్నాడు. కాగా, రెండు జట్లు బలంగా ఉండటంలో రేపటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

February 21, 2026 / 02:18 PM IST

తొలి ప్లేయర్‌గా ఎలీస్ పెర్రీ రికార్డ్!

ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 350* అంతర్జాతీయ మ్యాచులాడిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా అవతరించింది. మొత్తంగా హర్మన్(357*), సూజీ బేట్స్(355) తర్వాత 3వ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. కాగా ఆసీస్ తరఫున 15 టెస్టులు, 165 వన్డేలు, 170 T20లు ఆడిన పెర్రీ మొత్తం 7,634 రన్స్, 331 వికెట్లు తీసింది. ఇందులో 5 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలూ ఉన్నాయి.

February 21, 2026 / 02:17 PM IST

వాలీబాల్ సబ్ జూనియర్ సెలక్షన్‌లో గర్జనపల్లి బాలిక ఎంపిక

KNR: గర్జనపల్లి గ్రామానికి చెందిన నగరపు ఆశ్రిత జాతీయ స్థాయికి ఎంపికైంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న వాలీబాల్ సబ్ జూనియర్ సెలక్షన్లో సెలక్ట్ అయింది. ఈ సందర్భంగా డీవైఎస్‌వో రాందాస్ ఆశ్రితను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 02:16 PM IST

పొన్నపురంలో శక్తి యాప్ అవగాహన

నంద్యాల శక్తి టీం శనివారం పొన్నపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 122 నంబర్, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల వద్ద తినుబండారాలు తీసుకోవద్దని, అసభ్య ప్రవర్తన ఎదురైతే తల్లిదండ్రులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:15 PM IST

గిద్దలూరులో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ ఈ.వి. రమణబాబు, అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:15 PM IST

ఎమ్మెల్యే‌ విజయ్ చంద్రకు గిరిజనుల కృతజ్ఞతలు

PPM: పార్వతీపురం మండలంలో గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఆ ప్రాంత గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన గిరిజన నాయకులు, ఆయనను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకల సహకారం అయింది అన్నారు.

February 21, 2026 / 02:15 PM IST

ఏసీబీ దాడుల్లో చిక్కిన వ్యక్తి కోర్టుకు తరలింపు

ప్రకాశం: కంభంలో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తురిమెళ్ల గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రూ. 20 వేలు లంచం తీసుకుటుండగా వ్యవసాయ అధికారి మహమ్మద్‌ను పట్టుకున్నారు. అతని ఇంట్లో శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను నెల్లూరు కోర్టుకు తరలించారు.

February 21, 2026 / 02:14 PM IST

తప్పిన పెను ప్రమాదం

MDK: టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట ప్రధాన రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కర్రల సహాయంతో గడ్డిని లారీ నుంచి బయటకు తోసివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

February 21, 2026 / 02:13 PM IST

CMRF చెక్కు అందజేత

JN: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో MLA డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆయనకు రూ.2లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేయించారు. ఈ చెక్కును రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి శనివారం లబ్ధిదారు కుటుంబానికి అందించారు.

February 21, 2026 / 02:13 PM IST

మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

HNK: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. TGOS (మహిళా విభాగం) ఆధ్వర్యంలో క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవల్లో మహిళా గెజిటెడ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సాధికారత, పరిపాలనలో నాయకత్వం, సమాజాభివృద్ధి దిశగా వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

February 21, 2026 / 02:13 PM IST