ATP: జిల్లాలో మార్చి నెల పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయనున్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నగదు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 2.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.123 కోట్లు పంపిణీ కానున్నాయి. ఆ రోజున అందుకోలేని వారు మార్చి 2న సచివాలయాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం, భీమడోలు నారాయణపురం జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపవరం సీఐ రజిని కుమార్ పర్యవేక్షణలో పోలీసులున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.
విశాఖ: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖలోని జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును ప్రశంసిస్తూ, అంకితభావంతో కొనసాగించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NTR: మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన హేమంత్ సాయి కొత్తపేటకు చెందిన ఓ బాలిక(16)ను మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఈ మేరకు ఈ నెల 19న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.
ప్రకాశం: జిల్లాలో రబీ 2025-26 సీజన్కు అన్నిపంటలకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా 34,878 మెట్రిక్ టన్నుల ఎరువు పంపిణీ ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. రైతులు కొనుగోలు చేయు సమయంలో బస్తాపై ముద్రించిన MRP ధరలను చూసుకుని దాని ప్రకారం పైకం చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు.
EG: నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీని సోమవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర BJP అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ సందర్శించిన ఆయన వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వీసీతో చర్చించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన ప్రగతి పనులను మాధవు వీసీ వివరించారు.
KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ సెక్రెటరీ జయలక్ష్మి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ సంస్థ మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా శనగలు క్వింటా రూ.5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దిగుబడులు అమ్ముకోవాలని సూచించారు.
NDL: మహానంది గ్రామంలో ఆలయ ఉద్యోగి చల్లగాలి లక్ష్మయ్య సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా?, అనారోగ్య సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
W.G: కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని, కళాపరిషత్ నాటికలు ప్రజలకు సందేశాలు ఇచ్చే విధంగా ఉండాలని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మార్చి 13 నుంచి 16 వరకు వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటికల పోటీల పుస్తకాన్ని ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు సోమవారం కళాపరిషత్ ప్రాంగణంలో నిన్న ఆవిష్కరించారు.
NLR: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక సీపీఐ, రైతు సంఘం నాయకులు కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 10% నిధులు కేటాయించాలని అలాగే రూ. 2 లక్షలు పంట రుణాలు రైతులకు ఇప్పించాలని తదితర డిమాండ్లు పొందుపరిచారు.
మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు, కనిగిరి DSP సాయి ఈశ్వర యశ్వంత్ పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.
కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడపలో రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తే, నాయకులను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలిసిపోతామేమో కానీ, ప్రజల ఆదర అభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదని తెలిపారు.
KRNL: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి పట్టణంలో మసాలా చిన్న లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాల వేసి సోమవారం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PLD: మాచర్ల పరిసర ప్రాంతాల బస్సు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి తెలిపారు. ప్రయాణికులు తమ గ్రామాలకు బస్సుల రాకపోకలు, సమయపాలన లేదా ఇతర ఫిర్యాదుల కోసం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య 9959225432 ద్వారా నేరుగా డీఎంతో మాట్లాడవచ్చన్నారు.