ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని, నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
CTR: నగరపరిధిలో 40వ వార్డులో రూ.9.55 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ELR: ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కస్టోడియన్ శ్రీనివాసరావు చలమాల తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ 2,357 మంది, సెకండ్ ఇయర్ 2,191 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.
కడప: నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నింగి నుండి నిఘా ఉంచుతూ.. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ప్రకాశం: భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం తగదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
VSP: కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన రూ.3.28 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సవాల్ చేశారు. ఆదివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదాయ వృద్ధి కేవలం 1.97% ఉండగా 11.09% జీఎస్డీపీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.39 లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.
TPT: చంద్రగిరి పట్నంలో పశువుల పండుగ సంబరాలకు ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మిట్టమీద గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని పశువుల పండుగను తిలకించారు. ఈ సందర్భంగా పండుగను వీక్షించడానికి తరలివచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలను, కార్యకర్తలను అభిమానంగా పలకరించారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం దర్శనం నిమిత్తం కర్నూలుకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ATP: శ్రీవారి చిత్రపటాన్ని రాజకీయ స్వార్థానికి వాడుతూ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం వైసీపీ పతనానికి నాంది అని కూటమి నేతలు మండిపడ్డారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఇతర నేతలు మీడియా సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తిప్పికొడతామని హెచ్చరించారు.
కృష్ణా: పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో రూ. 4 కోట్ల 20 లక్షల నిధులతో 33/11KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.
ప్రకాశం: కనిగిరిలో రౌడీ షీటర్లు, లైంగిక నేరస్తులపై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరప్రవర్తనకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంచి పౌరులుగా మారి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచిస్తూ, ఇకపై నేరాలకు పాల్పడబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.
VZM: విజయనగరంలోని 19వ డివిజన్కి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి. బాలాజీ నగర్ కార్యాలయంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత జనసేనలోకి రావడం శుభపరిణామన్నారు.
నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం వైసీపీ చేసిన మహా తప్పిదమన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతకరమని, దేవుళ్లను వాడుకుంటూ.. స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంతో వైసీపీ పతనం మొదలైందన్నారు.
సత్యసాయి: రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి DSP శివన్నారాయణ స్వామి ఆదివారం వివరాలు వెల్లడించారు. నిందితుడు బాధితుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేయడమే కాకుండా, కత్తితో బెదిరించి అదనంగా నగదు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. తనిఖీల్లో భాగంగా నిందితుడి నుంచి ఫార్చునర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
E.G: ప్రజలు కోరుకున్న మంచి పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు తన అనుచరులు సుమారు 100 మందితో కలసి ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.