KRNL: పేదల సమస్యల పరిష్కారంలో మంత్రి టీజీ భరత్ మరోసారి చొరవ చూపారు. కర్నూలు కొత్తపేటకు చెందిన నరసింహ–శ్వేత దంపతుల కుమారుడు కార్తికేయ (9) పుట్టుకతో దివ్యాంగుడు. శస్త్రచికిత్సకు రూ.8.20 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో నిధులు మంజూరై, నంద్యాలలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
VZM: దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామజిక న్యాయం దినోత్సవం సందర్భంగా శుక్రవారం బొబ్బిలిలో దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ నిరసన తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు.
SS: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో జరిగిన నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దంపతులు ఇరువురు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియోజకవర్గ ప్రజల శుభకార్యాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు.
అన్నమయ్య: రాయచోటిలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైదరాబాద్ సీపీసజ్జన్నార్ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక గెస్ట్ హౌస్లో జరిగిన భేటీలో సీపీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలిపారు.
SKLM: ధర్మవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందుతుందా లేదా అనే విషయంపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తెలియజేయాలని కోరారు.
ASR: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పీహెచ్సీ డాక్టర్ హేమంత్ చౌదరి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. 64మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఈవో గంగరాజు, ఎల్టీ ఆనంద్ పాల్గొన్నారు.
GNTR: పెదపరిమిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన దాతలను అభినందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం సంతోషకరమని పేర్కొన్నారు.
KDP: ఖాజీపేట(M) ముత్తలూరుపాడు, మూలవారిపల్లె గ్రామాల్లో దాదాపు రూ. 20 లక్షలతో నూతనంగా సిమెంటు రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ కొంగని వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామయ్య వార్డు మెంబర్ సునీత పాల్గొన్నారు.
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా పలకరించారు. శుక్రవారం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఇద్దరూ కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఈ అనూహ్య భేటీ అక్కడున్న ప్రయాణికులు, అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.
E.G: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన మహమ్మద్ జరీనాకు రూ. 1,55,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల, వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఈ చెక్కు అందించడం జరిగింది అన్నారు.
ప్రకాశం: ఆర్టీసీ గ్యారేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమస్త కేటాయించాలని, గ్యారేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేశారు.
W.G: ఆకివీడులోని విద్యార్థులు అసెంబ్లీ సందర్శించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. స్థానిక జడ్పీ హైస్కూల్కు, సరోజినీ నాయుడు బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక హై స్కూల్ వద్ద బస్సులో విద్యార్థులు ఎక్కించి కూటమి నాయకులు జండా ఊపి ప్రారంభించారు.
ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని బడేటి చంటి శుక్రవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత నిస్తూ కృషి చేస్తున్నామన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రజలు నిరాశతో వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఉదయాన్నే వినతులు స్వీకరించామన్నారు.
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని నిర్మించిన నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిత్యపూజల కోసం రూ. 2.లక్షల విరాళం అందజేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.