ప్రకాశం: జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా ఉండటం, కేంద్రాలలోకి వెళ్లడం నిషేధమని, అలాగే పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పెంపెట్ల మణికుమార్ను తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారం జిల్లా రెవెన్యూ అధికారి టీ. సీతారామ మూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెంపెట్ల మణికుమార్ ఎంపిక కావడం పట్ల పలు ప్రజా సంఘాల నేతలు, పలువురు సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.
KRNL: గూడూరు పట్టణం పడమర బీసీ కాలనీలో శనివారం ఐదేళ్ల బోయ విజయలక్ష్మి ఆటలాడుతూ మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం గుంటూరులో ఉండగా, తాత–అవ్వల వద్ద ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లు కాలనీవాసులు చెప్తుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.
కడప YVU అభివృద్ధికి నిధులు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షులు D. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఆగిపోయిన పరిపాలన భవనం, హాస్పిటల్ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అలాగే, వర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు, అడ్మిషన్లు పెంచేందుకు ఉమ్మడి పీజీ సెట్ను రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలుచేయాలని ముంచంగిపుట్టు SI నాని ప్రజలకు సూచించారు. శనివారం ఆయన ముంచంగిపుట్టు వారపు సంతను సందర్శించారు. వారపు సంతల్లో కల్తీలేని, నాణ్యమైన సరుకులు విక్రయించాలని వ్యాపారులు, దుకాణాదారులకు సూచించారు. తూకాలు, కొలతలు సక్రమంగా ఉండాలన్నారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
TPT: మాజీ డీజీపీ డా. ఎం.మాలకొండయ్య శనివారం శ్రీసిటీని సందర్శించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ఇతర కార్యకలాపాలను వివరించగా.. విజన్, ప్రణాళిక, అమలు తీరును ప్రశంసించిన ఆయన దేశంలో ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ నిలుస్తుందని కొనియాడారు.
VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవం సందర్భంగా తొలి పూజ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.
AKP: కోటవురట్ల మండలంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు క్రాష్ ప్రోగ్రాం చేపట్టినట్లు ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో 495 హ్యాండ్ బోర్లు ఉన్నాయన్నారు. బోర్ మెకానిక్లు రోజు రెండు మూడు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులకు గురైన బోర్లకు 24 గంటల్లో రిపేర్లు చేస్తున్నారన్నారు. అలాగే 45 మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు.
విశాఖపట్నంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. నేటి స్థానిక మార్కెట్లో చికెన్ ధరలు సాధారణంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹230–₹235కు, స్కిన్లెస్ చికెన్ ₹235కు, బోనెలెస్ చికెన్ సుమారు ₹260 వరకు విక్రయించబడుతోంది. షాపులు మరియు డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది పేర్కొన్నారు .
TPT: నాయుడుపేట పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివశంకర్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు బీఎంఆర్ నగర్, బాలాజీనగర్, బోపయ్యకాలనీ, అగ్రహారం, ఆవనిహోమ్స్, కాళహస్తి రోడ్డు, పెట్రోల్ బంక్, రాజగోపాలపురం, బస్టాండ్, శ్రీరామ్ నగర్, జూవ్వలపాలెం, అశోక్ నగర్లో సరఫరా ఉండదని, ఈ మేరకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
SKLM: ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన దొంగను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి. లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కలి జగతి మెట్ట కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడి నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
CTR: టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో సనిమా రంగంలో ఆసక్తి నెలకొంది.
KDP: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో పోరుమామిళ్లకు చెందిన కవి బొల్లు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం తెలుగు, సాంస్కృతిక అకాడమీ AP ఛైర్మన్ విల్సన్ చేతుల మీదుగా ఆయనకు మెమెంటో అందించి సత్కరించారు.
NTR: జగ్గయ్యపేట మండలం మహమ్మద్ పేటలోని మసీదును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు సమస్యలు గురించి ఎంపీ కేశినేని దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ముస్లిం పెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
KKD: పిఠాపురం ఎస్సీ బాలుర హాస్టల్లో చదువుతున్న దాసరి పార్ధు శనివారం ఉదయం హాస్టల్ నుంచి RRBHR ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా హాస్టల్కు తిరిగి రాకపోవడంతో వార్డెన్ చుట్టు పక్కలా వెతికినా కనిపించ లేదు. పార్ధు సొంతూరు గొల్లప్రోలులోని రంగప్ప చెరువు అని సమాచారం. బాలుడికి 13 ఏళ్లు ఉంటాయాని, పాఠశాల యూనిఫామ్ వేసుకున్నాడని తెలిపారు.