• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం

VZM: జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజా ప్రతినిధులకు, జెసి సేధు మాధవన్‌కి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ విభాగానికి మరియు వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 06:30 PM IST

పోలీస్ శాఖకు సేవలు చిరస్మరణీయం

KDP: ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వీ.ఎస్. దేవ ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన క్రమశిక్షణతో కూడిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సమయం గడుపుతూ.. ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.

February 28, 2026 / 06:26 PM IST

తణుకు సబ్ జైలును పరిశీలించిన న్యాయమూర్తి

W.G: తణుకు సబ్‌ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి డీ.సత్యవతి శనివారం సందర్శించారు. సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగి ఉండాలని, ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేక పోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు.

February 28, 2026 / 06:26 PM IST

‘విద్యార్థులు శాస్త్రియ దృక్పదాన్ని అలవార్చుకోవాలి’

CTR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం అలవార్చుకోవాలని ఏంఈవో హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. శనివారం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు HM సుమతి, సీఆర్‌సీ కార్యదర్శి వెంకమరాజు బహుమతులు అందజేశారు.

February 28, 2026 / 06:23 PM IST

‘తెర్నకల్‌లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ’

KRNL: దేవనకొండ(మం) తెర్నకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ ఆలూరు ఇంఛార్జి వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివ ప్రసాద్, జనసేన ఇంఛార్జి వెంకప్ప, గోవింద్ గౌడ్ పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించి వాల్మీకి బోధనలను స్మరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

February 28, 2026 / 06:19 PM IST

‘పరీక్షలు అంటే భయం విడనాడాలి’

W.G: విద్యార్థులు పరీక్షలు అంటే భయం విడనాడాలని సీబీఐ మాజీ జేడీ వీ.వీ.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం తణుకు రూట్స్ స్కూలు ఆధ్వర్యంలో సీఎం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కులు ప్రాతిపదికగా కాకుండా విద్యార్థులు భవిష్యత్తుపై గురి పెట్టాలని సూచించారు.

February 28, 2026 / 06:18 PM IST

రేషన్ కార్డుదారులకు అలర్ట్

ATP: జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు మార్చి నెల నిత్యావసర సరుకులను సిద్ధం చేసినట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం, జొన్నలు, రాగులు ఉచితంగా అందజేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో గోధుమపిండి పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:07 PM IST

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

TPT: తిరుపతిలో కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతీయ సమీక్ష నిర్వహించారు. రైతులకు MSP చెల్లింపులు సమయానికి జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ సోరబ్ గౌర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:06 PM IST

చికిత్స పొందుతున్న 15 మంది బాధితులు

E.G: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రభావితమైన 15 మంది రోగులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, డెంటల్ లో ఇద్దరు, RACCలో ఒకరు, రవి చైతన్యలో ఒకరు, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

February 28, 2026 / 06:06 PM IST

హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కొడవలూరు మండలం గౌతమి నగర్ పంచాయతీలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేసి, చెత్త సంపద రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. రూ.36 లక్షలతో హెల్త్ క్లినిక్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి

E.G: పెరవలి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

సామర్లకోట పేలుడు ఘటనపై మంత్రి ఆవేదన

అన్నమయ్య: సామర్లకోట(మం) వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 06:01 PM IST

పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

PPM: పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి, స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసు కున్నారు.

February 28, 2026 / 06:00 PM IST

మాధవరావు సేవలను కొనియాడిన ఏఎస్పీ

SKLM: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందుతున్న పి. మాధవరావుకు శనివారం జిల్లా ఎస్పీ ఆఫీసులో రిటైర్మెంట్ కార్యక్రమం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ హాజరై, మాధవరావును పూలమాలలు, దుశాలువతో సత్కరించారు. సుదీర్ఘకాలంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు అందించిన సేవలను ప్రశంసించారు.

February 28, 2026 / 06:00 PM IST

టిడ్కో సీ-1 బ్లాక్‌లో మంచినీటి సమస్య

VSP: పెడగాడి టిడ్కో కాలనీ సీ-1 బ్లాక్‌లో మంచినీటి సమస్య తలెత్తడంతో బాధితుల పిలుపుమేరకు మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కనకరాజు శనివారం వెంటనే స్పందించారు. శుద్ధ కారణంగా పైపులు స్ట్రక్ అవుతున్నాయని గుర్తించి, మూడు రోజుల్లో పైపులు, మేన్‌హోల్స్ క్లీనింగ్ చేపడతామని తెలిపారు. గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ అడుగున మట్టి పేరుకుపోవడంతో పంపింగ్‌కు ఆటంకం కలుగుతోందన్నారు.

February 28, 2026 / 06:00 PM IST