• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ‘చలో గుంటూరు’.. వైసీపీ పిలుపు

GNTR: టీడీపీ ప్రభుత్వం ‘రెడ్ బుక్’ రాజ్యాంగంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఈ నెల 21న ‘చలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

February 20, 2026 / 08:40 PM IST

పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్‌ను అందజేసిన ఎస్సై

AKP: గొలుగొండ(మం) చోద్యం వంతెన వద్ద జారిపడిన హ్యాండ్‌ బ్యాగ్‌ను కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వరరావు బాధితురాలికి అందించారు. బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి కుటుంబంతో వెళ్తుండగా బ్యాగ్ పోగొట్టుకుంది. గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మి దాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.59,500 నగదు సహా బ్యాగ్‌ను అందజేశారు.

February 20, 2026 / 08:39 PM IST

బోల్తా పడిన వరి కోత మిషన్

BPT: అద్దంకి నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న వరి కోత మిషన్ శుక్రవారం బలరామకృష్ణాపురం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు వెంటనే సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు.

February 20, 2026 / 08:35 PM IST

మార్చి 15న మెగా జాబ్ మేళా

సత్యసాయి: హిందూపురంలో మార్చి 15న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సప్తగిరి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో 100కు పైగా బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని తెలిపారు.

February 20, 2026 / 08:34 PM IST

ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన సీలేరు ఎస్సై

ASR: జీకేవీధి(మం) సీలేరు ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, గంజాయి రవాణా నియంత్రణతో పాటు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ విడిచి పెట్టారు.

February 20, 2026 / 08:34 PM IST

అంగన్వాడీ కార్యకర్త మృతి

ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అంగన్వాడి కార్యకర్త ఉస్తెలమూరి విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందింది. 24 సంవత్సరాలుగా గ్రామంలో పనిచేస్తూ గర్భవతులకు, బాలికలకు, చంటి పిల్లలకు సేవలు అందించారు. అందరి ఆదరాభిమానాలను సంపాదించుకున్నారని గ్రామస్థులు అన్నారు. విజయలక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

February 20, 2026 / 08:31 PM IST

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఐ వీరేంద్రబాబుకు సూచించారు.

February 20, 2026 / 08:30 PM IST

ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

VZM: దత్తిరాజేరు(మం) షికారు గంజి ఏపీ మోడల్ స్కూల్లో 2026-2027 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి శుక్రవారం తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు www.apms.apcfss.in వైబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:28 PM IST

‘ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత ముందుకు రావాలి’

E.G: ఉద్యోగాల కోసం ఎదురు చూసే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే.వాణిధర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాజమండ్రిలో నిర్వహిస్తున్న ‘యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు -అవకాశాలు & సవాళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కేవలం వ్యాపారం కాదన్నారు.

February 20, 2026 / 08:25 PM IST

‘ఎస్టీలకు ఆధార్ కార్డులు ఇప్పించాలి’

W.G: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని, శ్మశాన వాటిక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం కమ్యూనిటీ భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ.. కాలనీలోని యానాది సామాజిక వర్గానికి చెందిన పలువురికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవని ఆవేదన చెందారు.

February 20, 2026 / 08:24 PM IST

జిల్లాలో పోలీసుల వాహనాల తనిఖీలు

CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి.

February 20, 2026 / 08:22 PM IST

సీఎస్ వీసీలో పాల్గొన్న కలెక్టర్

ATP: CS కె.విజయానంద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సానుకూల ప్రజా దృక్పథం, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీ వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. విజయవాడ నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం నుంచి JC విష్ణుచరణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:20 PM IST

‘వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి’

ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు SI మాధవరావు హెచ్చరించారు. వేములపాడులో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 20, 2026 / 08:18 PM IST

ధైర్య స్పర్శ చొరవపై విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమం

CTR: కుప్పం రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్, తన సిబ్బందితో కలిసి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను బలోపేతం చేయడం, లక్ష్య సాధనకు ప్రేరణ, సైబర్ అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మార్గ నిర్దేశం చేశారు. యువత చదువు పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని నొక్కి చెప్పారు.

February 20, 2026 / 08:18 PM IST

విద్యార్థులకు సామాజిక చట్టపరమైన అంశాలపై అవగాహన

CTR: పాలసముద్రంలోని అరుణోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎస్సై రాజశేఖర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. పోక్సో చట్టం శిక్షలు, పొగాకు వాడకం యొక్క ప్రభావాలు, మాదకద్రవ్యాలు ధైర్య స్పర్శ కార్యక్రమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ మోసాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:17 PM IST