• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

2వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా: సీపీఎం

KDP: ఖాజీపేట మండలంలో సుమారు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామీణ ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన ‘భూ సదస్సు’లో ఆయన మాట్లాడుతూ.. 10 గ్రామాల్లో కబ్జాలకు గురైన ఈ భూములను అధికారులు వెంటనే కాపాడాలని, కబ్జాదారులకు రాజకీయ పార్టీల అండ ఉందని విమర్శించారు.

February 20, 2026 / 07:04 PM IST

రబీ సీజన్లో శనగలకు మద్దతు ధర రూ. 5,875 వేలు

తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 5,875 వేల చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 07:01 PM IST

ప్రారంభమైన చెన్నకేశవ స్వామి ఉత్సవాలు

సత్యసాయి: పుట్టపర్తిలోని పెద్ద కమ్మవారిపల్లిలో శ్రీ చెన్నకేశవ స్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దారపునేని చంద్రశేఖర్ నివాసం నుంచి స్వామివారి వెండి కవచాలను ఉరుము, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యలువగంప మహోత్సవం నిర్వహించారు.

February 20, 2026 / 07:00 PM IST

జగన్‌తో కలిసి ప్రయాణించిన శింగనమల నేతలు

ATP: YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా వీరు వెళ్లినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం.

February 20, 2026 / 07:00 PM IST

ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి: MLA

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.

February 20, 2026 / 07:00 PM IST

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గుడూరు పరిధిలోని చిట్టిగూడూరు గ్రామ శివారులో ఎస్సై దివ్య ప్రకాష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:55 PM IST

రేపు కోయిలకుంట్లలో పర్యటించనున్న మంత్రి

NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. కోయిలకుంట్ల పట్టణంలో ఉదయం 10 గంటలకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర, స్వచంద్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని ఆయన అన్నారు.

February 20, 2026 / 06:55 PM IST

‘మనమిత్ర వాట్సప్ గవర్నెస్‌పై విస్తృత అవగాహన కల్పించాలి’

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

February 20, 2026 / 06:54 PM IST

ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO ఏ. రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apmలో చూడవచ్చని తెలిపారు.

February 20, 2026 / 06:52 PM IST

కంభంలో పరిశుభ్రత పనుల పరిశీలన

ప్రకాశం: మార్కాపురం డీఎల్డీవో బాలునాయక్ కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డుపై జరుగుతున్న చెత్త తొలగింపు పనులను శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.

February 20, 2026 / 06:50 PM IST

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 20, 2026 / 06:48 PM IST

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: DRO

KRNL: పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల DRO డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 20, 2026 / 06:42 PM IST

పీలేరు ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారి

అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:40 PM IST

పాముకాటుతో మహిళ మృతి

ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:40 PM IST

అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్‌కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.

February 20, 2026 / 06:38 PM IST