ATP: అనంతపురం ఓల్డ్ టౌన్లో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే అందజేయాలని కోరారు.
GNTR: నల్లచెరువులో బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై శనివారం కమిషనర్ మయూర్ అశోక్ స్పందించారు. ఈ నెలలోనే ఏబీసీ (ABC) సెంటర్ను అందుబాటులోకి తెచ్చి కుక్కల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యానిమల్ బోర్డ్ అనుమతులు వచ్చినందున డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.
నంద్యాల శక్తి టీం శనివారం పొన్నపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 122 నంబర్, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల వద్ద తినుబండారాలు తీసుకోవద్దని, అసభ్య ప్రవర్తన ఎదురైతే తల్లిదండ్రులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ ఈ.వి. రమణబాబు, అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
PPM: పార్వతీపురం మండలంలో గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఆ ప్రాంత గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన గిరిజన నాయకులు, ఆయనను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకల సహకారం అయింది అన్నారు.
ప్రకాశం: కంభంలో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తురిమెళ్ల గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రూ. 20 వేలు లంచం తీసుకుటుండగా వ్యవసాయ అధికారి మహమ్మద్ను పట్టుకున్నారు. అతని ఇంట్లో శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను నెల్లూరు కోర్టుకు తరలించారు.
E.G: రుడా ఛైర్మన్, తూ.గో జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి సమక్షంలో సీతానగరం మండలం వంగలపూడికి చెందిన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కాండ్రేగుల ఫణిబాబు శనివారం YCPకి రాజీనామా చేసి TDPలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటరమణ చౌదరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఫణిబాబు చేరికతో వంగలపూడిలో TDP మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
E.G: విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. DRDA – సెర్ప్ శాఖ అమలు చేస్తున్న పథకాలు అమలుపై శనివారం రాజానగరంలో ఆయన సమీక్షి నిర్వహించారు. ఫీల్డ్ సిబ్బంది పై తరచూ పిర్యాదులు వస్తున్నాయని అలా రాకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు.
ELR: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అన్నారు. శనివారం ఉంగుటూరు టోల్గేట్ వద్ద చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించినవారికి జరిమానాలను విధించకుండా, వాహన దారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.
W.G: ఆకివీడు మండలం దుంపగడపలో శనివారం ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ నాగరాణి పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా రహదారిని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అనంతరం వర్మీ కంపోస్ట్ ఎరువు విక్రయాలను ప్రారంభించారు.
ASR: రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంపైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో నెలవారీ సమావేశాల నిర్వహణ వారికి ప్రాణసంకటంగా మారింది. ఏదైనా పెను ప్రమాదం జరక్కముందే ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయానికి వెంటనే నూతన భవనాన్ని కేటాయించాలని సిబ్బంది కోరుతున్నారు.
రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త జనార్దన్కు రూ.లక్షకు పైగా విలువ చేసే ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్ను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన జనార్దన్కు నేతలు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకలు పాల్గున్నారు.
GNTR: ఫిరంగిపురం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములూరిపాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.
SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.
KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.