ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ నుంచి మొదలుకొని చిన్న కంపెనీల వరకు కాస్ట్ కటింగ్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ప్రభావం నేపథ్యంలో తొలగిస్తున్నాయి. రోజు ఓ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కాస్ట్ కట్ చేసింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. మొత్తం 1,300 మంది ఉద్యోగులను ఇ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ ద్వారా టీ స్టాల్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్.. ఒక్కటేమిటి అన్నీ చోట్ల స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తన సేవలను ఫోన్ పే మరింత విస్తరించింది. విదేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూట...
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి ...
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్కు రుణాల...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్బోట్ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్బోట్పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...
టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...
హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫ...
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్ద రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆదానీ సంస్దలకు చెందిన స్టాక్స్ అన్నీ మార్కెట్ లో భారీ పతనం అవుతున్నాయి. ఈ కారణంగా ఆదానీ సంపద ఆవిరవుతునే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. అదానీ [&h...
ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజల...
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయి...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...
ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 ...